హైదరాబాద్‌ ఐఐటీలో కరోనా కలకలం

Telugu Lo Computer
0


తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లా కంది శివారులో ఉన్న ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కలకలం రేగింది. క్యాంపస్‌లో మొత్తం 119 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో విద్యార్థులు, సిబ్బంది, పలువురు కార్మికులు ఉన్నారు. ఈ మేరకు యాజమాన్యం ప్రకటించింది. కరోనా సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపింది. వారందరినీ ఐఐటీ హైదరాబాద్‌ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్‌ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)