గుడివాడ కేసినో వ్యవహారంపై రెండు కేసులు నమోదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా గుడివాడ కేసినో వ్యవహారంపై రెండు కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేత బోండా ఉమా ఫిర్యాదు మేరకు మంత్రి కొడాలి నాని ఓఎస్‌డి శశిభూషణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గుడివాడ సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొనకళ్ల నారాయణ, బోండా ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల కుమార్‌ రాజా, నక్కా ఆనంద్‌ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, తంగిరాల సౌమ్య, ఆచంట సునీతపై కేసు నమోదు చేశారు. గుడివాడలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నించారని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి, బోండా ఉమా కారు అద్దాల ధ్వంసం వ్యవహారంలో శశిభూషణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుడివాడలో కేసినో వ్యవహారంపై నిజ నిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతల పర్యటనను భగ్నం చేయడానికి అధికార పార్టీ నేతలు బరితెగించారు. పోలీసుల తీరు కూడా కలిసిరావడంతో చెలరేగిపోయారు. నిజ నిర్ధారణ కోసం శుక్రవారం గుడివాడ వచ్చిన టీడీపీ నాయకులే లక్ష్యంగా దౌర్జన్యకాండకు మంత్రి కొడాలి నాని అనుచరులు, వైసీపీ నాయకులు తెగబడ్డారు. గుడివాడను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకులపై భౌతిక దాడులు చేస్తూ రాళ్ల వర్షం కురిపించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)