రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం అన్నవరం వర్తనపల్లికి చెందిన గ్రామస్తస్తులైన తండ్రీ, కుమారుడు ఇద్దరూ చిట్టపాడు స్కూల్‌కి బైక్‌ మీద వెళుతుండగా.. లంబసింగి బోధకొండమ్మ గుడి కింద వెనుకనుంచి వచ్చిన లారీ బైక్‌ని ఢీ కొట్టడంతో  కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కుమారుడి మృతదేహాన్ని పోలీసులు చింతపల్లి గ్రామానికి తరలించారు. గాయాలైన తండ్రిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)