ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకు చెందిన రాజశేఖర్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి (38) బెంగళూరు బీటీఎం లేఔట్ లో నివాసం ఉంటూ బెంగళూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. చెక్ బౌన్స్ కేసులో కోర్టు విచారణకు హాజరైన రియల్ వ్యాపారి స్నేహితులతో మాట్లాడి కారులో బయలుదేరాడు. మార్గం మద్యలో నిత్యం రద్దీగా ఉండే సర్కిల్ వద్ద కారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కారును అడ్డగించిన ప్రత్యర్థులు అతన్ని దారుణంగా నరికేశారు. వేటకోడవళ్లతో నరకడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్మారంగం మీద వేట కొడవలితో నరకడం కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కారులో అనేక కీలక పత్రాలు ఉన్నా వాటిని ప్రత్యర్థులు వదిలేసి వెళ్లిపోవడం అనేక అనుమానాలకు దారితీసింది.
బెంగళూరు లో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య
January 06, 2022
0
Tags