ఏపీలో 4,570 కరోనా కేసులు

Telugu Lo Computer
0


గత 24గంటల్లో ఏపీలో 30,022మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో 4,570 కరోనా పాజిటీవ్ కేసులుగా నిర్థారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 1,028 కేసులు, గుంటూరు జిల్లాలో 368, అనంతపురం జిల్లాలో 347 కేసుల వెల్లుడయ్యాయి. అదే సమయంలో 669 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,06,280 పాజిటివ్ కేసులు నమోదు కాగా. 20,65,000 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 26,770 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,510కి పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)