రూ.2కే దోశ, రూ.2కే ఇడ్లీ, రూ.4కే ఊతప్పం!

Telugu Lo Computer
0


తమిళనాడు లోని   తిరుచిరాపల్లి, వొరైయూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల చిన్నతంబి దోశ బండి ఆరేళ్లుగా ఆహార ప్రియులకు రుచికరమైన దోశలు అందిస్తోంది. ఒకప్పుడు వంట మనిషిగా పనిచేసిన చిన్నతంబి.. పేదలకు అందుబాటు ధరలో రుచికరమైన దోశలు అందించాలనే ఉద్దేశంతో సొంతంగా హోటల్ ప్రారంభించాడు. ఓ వైపు బతుకుదెరువు కోసం కష్టపడుతూనే తన స్టాల్‌కు విచ్చేసే వారికి మాత్రం దోశలతో కడుపు నింపుతున్నాడు. రెండు రూపాయలకు దోశ, మూడు రూపాయలకు ఇడ్లీ, రూ.4 కే ఊతప్పం అందిస్తున్నాడు. వీటికి తోడుగా రెండు కుర్మాలు, రెండు చట్నీలతో పాటు సాంబార్ కూడా ఇస్తున్నాడు. ఇవే కాదు పరోటా, ఆమ్లెట్‌తో మరిన్ని టిఫిన్స్ సైతం తక్కువ ధరకే విక్రయిస్తున్నాడు. ఈ మేరకు ప్రతిరోజూ దాదాపు 600 నుంచి 800 దోశలు అమ్ముతున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)