ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 33 వేలకు పైగా శాంపిల్స్ పరీక్షించగా 547 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ తో విశాఖలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14, 500కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 128 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 2, 266 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ ఆందోళకు గురిచేస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో 547 మందికి కరోనా పాజిటివ్!
January 06, 2022
0