కిరోసిన్ పోసి నిప్పంటించాడు

Telugu Lo Computer
0



హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రకాష్ నగర్ లో ఉండే వెంకటలక్ష్మి నాచారం లో ఈఎస్ఐ ఆస్పత్రిలో  స్వీపర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే జగద్గిరిగుట్ట లో ఉండే వెంకటేష్ అనే యువకుడితో ఆమె మూడేళ్లుగా సహజీవనం చేసింది. ఇటీవలే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ వచ్చారు. దీంతో ప్రస్తుతం వీరిద్దరూ విడిగా ఉంటూ ఉంటున్నారు. అయితే ప్రియురాలితో కలవాలని వెంకటేష్ భావించినప్పటికీ ప్రియురాలు మాత్రం దూరం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల రాత్రి సమయంలో ప్రకాష్ నగర్ లో ఉంటున్న వెంకటలక్ష్మి నివాసానికి వచ్చి మరోసారి గొడవపడ్డాడు. తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్ పోసి నిప్పంటించాడు.దీంతో ఆర్తనాదాలు చేస్తూ వెంకటలక్ష్మి అక్కడికక్కడే సజీవ దహనం అయింది ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ఘటనలో అటు ప్రియుడు వెంకటేష్ కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)