పండుగలను, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ - కొల్లాం మధ్య అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 17న సికింద్రాబాద్ నుంచి కొల్లాం స్టేషన్కు 07109 నంబర్ గల రైలు బయల్దేరనుంది. కొల్లాం నుంచి సికింద్రాబాద్కు డిసెంబర్ 19న 07110 నంబర్ గల రైలు బయల్దేరనుంది. 07109 నంబర్ గల రైలుకు రిజర్వేషన్ల ప్రక్రియ డిసెంబర్ 10న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్చెరి, తిరువళ్ల, చెంగనూరు, మావలికర, కయాంకులం స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి.
సికింద్రాబాద్ - కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు
December 09, 2021
0
Tags