జోగి రమేష్ వల్ల నాకు ప్రాణ హాని

Telugu Lo Computer
0

 

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి తాజాగా ఎమ్మెల్యే జోగి రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి మీడియా ముందుకు వచ్చిన లీలావతి జోగిపై అనేక ఆరోపణలు చేశారు. జోగి రమేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు. ``నా భర్త కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక సర్పంచ్ ప్రదీప్ కుమార్. గతంలో నాపై నా భర్తపై కేసులు పెట్టి వేధించారు. నా భర్తకు ఎమ్మెల్యే జోగి రమేష్ కొంతమంది వ్యక్తులు చేత మత్తుమందు ఇచ్చి తన వైపునకు తిప్పుకున్నాడు`` అని లీలావతి పేర్కొన్నారు.. అంతేకాదు, పార్టీ కోసం తాము ఎంతో చేశామని, పాదయాత్ర సమయంలోనూ జగన్ సీఎం కావాలని తాము కూడా సంఘీభావం ప్రకటించామన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ఎమ్మెల్యే తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని లీలావతి ఆరోపించారు. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఈ బెదిరింపులతో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో జోగి నుంచి తమను రక్షించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని లీలావతి పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)