టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వినాయక చవితి పండుగ సందర్భంగా కేబుల్ వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే తాజాగా సైబరాబాద్ పోలీసులు యాక్సిడెంట్ కేసులో సాయిధరమ్ తేజ్కి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై త్వరలో చార్జిషీట్ దాఖలు చేస్తామని ప్రకటించారు. దాదాపు 45 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ ప్రమాదంపై సాయి ధరమ్ తేజ్ కు నోటీసులు జారీ అయ్యాయి. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ నుంచి సమాధానం వస్తుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
సాయి ధరమ్ తేజ్ కు నోటీసులు!
December 28, 2021
0