అవాక్కైన భర్త !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కుంచనపల్లిలోని ఓ భవనంలో ఉన్న ఫ్లాట్ లో ప్రభుత్వ ఉద్యోగి నివాసముంటున్నాడు. అయితే, అతను పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు, బట్టలు పడి అంతా చిందవందరగా ఉంది. తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అన్ని కోణాల్లో పరిశీలించారు. అయినా కూడా వారికి అక్కడ దొంగతనం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అనుమానమొచ్చి ఆ ప్రభుత్వ ఉద్యోగి భార్యను విచారించారు. అదేవిధంగా క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించి పోల్చగా అవి ఆమెవేనని తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. అదంతా కూడా కట్టుకథ అని, ఆమెకు మతిస్థిమితం లేకపోవడంతో అతని భార్య ఈ విధంగా వ్యవహరించిందని పోలీసులు తెలిపినట్లు సమాచారం.


Post a Comment

0Comments

Post a Comment (0)