తెలంగాణ లోని సంగారెడ్డికి చెందిన పాటిల్ శివాజీ(23), బోయిన్ వెంకటేశం (21), అజ్జంపల్లి గోవర్ధన్రెడ్డి (23) ముగ్గురు స్నేహితులు. వీరిలో వెంకటేశం, గోవర్ధన్రెడ్డి కూకట్పల్లి ఎల్లమ్మబండలో ఉంటూ ఫుడ్ డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత వీరితో పాటిల్ శివాజీ కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయసాగారు. కొద్దిరోజులుగా ఫుడ్ డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ రెక్కీ నిర్వహించారు. ఇళ్లలోని కిటికీలు, తలుపుల వద్ద ఉన్న వాటిని తస్కరించేవారు. ఇలా కూకట్పల్లి ప్రాంతంలో ఏడు ల్యాప్టాప్స్, ఐప్యాడ్ను దొంగిలించారు. ఈనెల 22న ల్యాప్టాప్లను కేపీహెచ్బీకాలనీలోని పద్మావతి ప్లాజాలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు బైకు (టీఎస్15ఈడబ్ల్యూ8823)పై వచ్చారు. అక్కడే తనిఖీలు చేస్తున్న క్రైం సిబ్బందికి వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొన్నారు. విచారించగా చేసిన నేరాలను ఒప్పుకొన్నారు. వారినుంచి ఏడు ల్యాప్టాప్లు, ఐప్యాడ్, బైకును స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు క్రైం సీఐ ఆంజనేయులు తెలిపారు.