రాజధాని రైతుల సభలో వైసీపీ ఎంపీ'రఘురామకృష్ణంరాజు

Telugu Lo Computer
0


సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నిర్వఘ్నంగా పూర్తయ్యింది. న్యాయంస్థానం టూ దేవస్థానం అంటూ చేపట్టి రాజధాని రైతులు పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగింది. మహా పాదయాత్ర ముగింపుగా ఈ రోజు తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ ఏర్పాటు చేశారు అమరావతి రైతులు. అయితే ఈ సభలో వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఆయన తిరుపతి విమానాశ్రయంకు చేరుకొని అక్కడి నుంచి సభ ప్రాంగణానికి విచ్చేశారు. అయితే సభకు వచ్చిన రఘురామకృష్ణంరాజుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రఘురామరాజు మాట్లాడుతూ.. ఇది రాజకీయ సభ కాదని దగాపడ్డ రైతుల సభ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రైతుల మద్దతు కోసం అన్ని వర్గాలు తరలివస్తున్నాయన్నారు. ఈ సభ తర్వాత 3 రాజధానుల గురించి మాట్లాడేవారు ఉండరు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నూరుశాతం అమరావతి రాజధానిగా ఉంటుందని, అడ్డుపడే మేఘాలు అశాశ్వతం.. అమరావతే శాశ్వతం అంటూ ఆయన మాట్లాడారు.


Post a Comment

0Comments

Post a Comment (0)