పట్టాలు తప్పిన రైలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కిరండోల్-విశాఖ రైల్వే లైనులో 17 బోగీలతో వెళ్తున్న గూడ్స్‌ రైలు ఛత్తీస్ ఘడ్  లోని దంతెవాడలో అదుపు తప్పి పట్టాలు తప్పింది. దాంతో బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇనుప ఖనిజంతో కిరండోల్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా భాన్సీ-కమలూర్ స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 4.05 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)