బిడ్డను చంపిన కసాయి!

Telugu Lo Computer
0


తెలంగాణ లోని మెదక్ జిల్లా టేక్మాల్ మండలం పల్వంచకు చెందిన రమణయ్యకు అదే గ్రామానికి చెందిన సావిత్రితో 2014లో పెళ్లయింది. ఏడాదిన్నర అయినా పిల్లలు కలగకపోవడంతో 2016లో విడిపోయారు. అదే ఏడాది సావిత్రి సంగారెడ్డి జిల్లా అందోల్​ మండలం రోళ్లపాడుకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారిద్దరికి వర్షిణి(2) పుట్టింది. ఎనిమిది నెలల కింద భర్తతో విడిపోయి, తిరిగి పల్వంచకు వచ్చిన సావిత్రి రమణయ్యతో ఉంటోంది. సావిత్రి గర్భం దాల్చడంతో రమణయ్య మంగళవారం టేక్మాల్​ పీహెచ్​సీకి చెకప్​కు తీసుకెళ్లాడు. రిటర్న్​లో సావిత్రిని మరొకరి బైక్​పై ఇంటికి పంపించాడు. వర్షిణిని తన బైక్​పై ఎక్కించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత పాప స్పృహ తప్పిపడిపోయిందని చెప్పి వర్షిణిని ఇంటికి తీసుకెళ్లాడు. సావిత్రి పరిశీలించగా అప్పటికే వర్షిణి చనిపోయింది. పాప గొంతు నులిమినట్టు గుర్తు ఉండడంతో రమణయ్యను నిలదీసింది. వర్షిణి తనకు పుట్టలేదని, అలాగే పుట్టబోయే బిడ్డకు అడ్డొస్తుందనే చంపేశానని రమణయ్య చెప్పాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)