హైదరాబాద్లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట బజార్కు చెందిన మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఇళ్లు చూపిస్తానని చెప్పి ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఫొటోలు వీడియోలు తీసి బెదిరిస్తున్నట్టు గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోట బజార్కు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని మహిళ పోలీసులకు తెలిపింది. మహిళ ఫిర్యాదుతో కేసునమోదు చేసుకున్న పోలీసులు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
Post a Comment
0Comments
3/related/default