దూరంగా వెళ్లి మూత్రం విసర్జన చేయమనందుకు..... !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ముంబైలో ఓ వ్యక్తి తనకు దూరంగా వెళ్లి మూత్రం పోయమని చెప్పినందుకు ఒకరిని హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహ్మద్ రఫీక్ అన్సారీ (41) తన స్నేహితుడితో చాట్ చేస్తున్నప్పుడు నిందితుడు మహ్మద్ అబ్దుల్లా ఆలం షేక్ (24) ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ వ్యక్తి వారిద్దరు కూర్చున్న ప్రదేశానికి దగ్గరగా మూత్ర విసర్జన చేయడం మొదలు పెట్టాడు. దీంతో కాస్త దూరంగా వెళ్లి మూత్ర విసర్జన చేయాలని  అన్సారీ షేక్‌కు చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. అలా చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారాడంతో ఆగ్రహంతో షేక్‌ కత్తితో అన్నారీని దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్నారీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అన్సారీని హత్య చేసిన నిందితుడు షేక్‌ను వదలా ట్రక్ టెర్మినల్ స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)