పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాల వల్ల వంతెన పిల్లర్ కిందకు కుంగింది. దీంతో సిలిగురిలోని మతిగరలో బాలాసన్ వంతెనపై ట్రాఫిక్ను నిలిపివేశారు. భారీ వర్షం, వరద నీటి ప్రవాహం వల్ల వంతెనకు చెందిన ఒక స్తంభం కొద్దిగా కిందకు దిగిందని సిలిగురి సీపీ గౌరవ్ శర్మ తెలిపారు. దీంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేవలం ద్విచక్ర వాహనాలు, పాదచారులను మాత్రమే వంతెనపై నుంచి వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ వంతెన మీదుగా కార్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు వెల్లడించారు.