నిజామాబాద్ జిల్లాలోని మల్లారంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదని క్షతగాత్రులు వాపోతున్నారు. మల్కాపూర్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.