స్టెరాయిడ్లు తీసుకొని నర్సు ఆత్మహత్య

Telugu Lo Computer
0

 

తోటి ఉద్యోగి వేధింపులు తాళలేక అధిక మోతాదులో స్టెరాయిడ్‌లు తీసుకొని ఓ నర్సు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని తల్లాడకు చెందిన 17 ఏండ్ల బాలిక ఇంటర్ పూర్తి చేసి స్థానికంగా ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పనిచేస్తూ హాస్టల్ లో ఉంటోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో పని చేస్తున్న మధు అనే వ్యక్తితో ఆమె పరిచయం ఏర్పడింది. అతను ఆ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నట్టు తెలిసింది. కొంత కాలం తరువాత వేధించడం మొదలు పెట్టాడు. అలాగే ఆ బాలిక నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిసింది. వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక మనస్తాపం చెంది ఆదివారం రాత్రి అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి దండ్రులు ఫిర్యాదు మేరకు మధు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)