కేరళలో కొనసాగుతున్న కరోనా ఉధృతి

Telugu Lo Computer
0

 

దేశమంతటా కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కేరళలో మాత్రం భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య మాత్రం ప్రతిరోజూ 30 వేలకు దరిదాపుల్లోనే ఉంటుంది. గత రెండు మూడు రోజులుగా 32 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదు కాగా, ఇవాళ కొత్తగా 29,322 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38,83,186కు చేరింది. ఈ రోజు  కేరళలో కొత్తగా 131 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 21,280కి చేరింది. ఇదిలావుంటే ఇవాళ 22,938 మంది కరోనా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులలో రికవరీలు, మరణాలు పోను మరో 2,46,437 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో చేసిన పరీక్షల్లో పాజిటివిటీ రేటు 17.91 శాతంగా ఉన్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)