యువకుడి దారుణ హత్య

Telugu Lo Computer
0


మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యకు గురైన మహేష్ మృతదేహంతో బంధువులు ధర్నా చేసారు. మహేష్ మృతదేహానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పూలమాలవేసి నివాళులర్పించారు. మహేష్‌ను సర్పంచ్ భర్త నర్సింహులు గౌడ్ హత్య చేసాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సర్పంచ్ భర్త నర్సింహులు గౌడ్ ఇంటి ముందే శవాన్ని ఖననం చేస్తామంటూ రాష్ట్ర ఎరుకల సంఘం నాయకులు ప్రకటించారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)