వచ్చే గణతంత్ర వేడుకలు సెంట్రల్ విస్టాలోనే: ప్రభుత్వం

Telugu Lo Computer
0


వచ్చే ఏడాది జరగబోయే గణతంత్ర వేడుకలు సెంట్రల్ విస్టాలోనే జరుగుతాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం స్పష్టం చేశారు. వచ్చే జనవరి 26వ తేదీ నాటికి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని, పరేడ్ కొత్త భవనం పరిధిలోనే జరుగుతాయని ఆయన తెలిపారు. అంతే కాకుండా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శీతాకాల సమావేశాలు కూడా కొత్త పార్లమెంట్ భవనంలోనే కొనసాగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''సెంట్రల్ విస్టా అవెన్యూ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వచ్చే జనవరి 26న జరగబోయే గణతంత్ర ఉత్సవాల పరేడ్ సెంట్రల్ విస్టాలోనే జరుగుతాయి'' అని అన్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ఇప్పటి అవసరాలకు సరిపోదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన పార్లమెంట్ భవనంతో పాటు కేంద్ర కార్యాలయాల భవనాలను సమ్మిళితం చేస్తూ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను మోదీ ప్రభుత్వం డిజైన్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)