భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ తిరుమలగిరిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ వ్యక్తి భార్య, అత్తను నరికి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం తిరుమలగిరిలో నివాసముంటున్న చిన్నబాబు, పుష్ప భార్యాభర్తలు. తిరుమలగిరి మిలటరీ హాస్పిటల్‌లో పుష్ప పని చేస్తుండే వారు. అదే హాస్పిటల్‌లో చిన్న బాబు ఔట్‌సోర్సింగ్‌ ఎలక్ట్రీషన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్య పుష్పను, అత్తను చిన్నబాబు హత్య చేశాడు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)