సికింద్రాబాద్ తిరుమలగిరిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ వ్యక్తి భార్య, అత్తను నరికి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం తిరుమలగిరిలో నివాసముంటున్న చిన్నబాబు, పుష్ప భార్యాభర్తలు. తిరుమలగిరి మిలటరీ హాస్పిటల్లో పుష్ప పని చేస్తుండే వారు. అదే హాస్పిటల్లో చిన్న బాబు ఔట్సోర్సింగ్ ఎలక్ట్రీషన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్య పుష్పను, అత్తను చిన్నబాబు హత్య చేశాడు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి
September 16, 2021
0