సీరమ్ ఉద్యోగులకు మూడో డోసు
August 19, 2021
0
కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నవారు ఆరు నెలల తర్వాత మూడో డోసు తీసుకోవడం అవసరమవుతుందని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఛైర్మన్ సైరస్ పూనావాలా పేర్కొన్నారు. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది అవసరమని అన్నారు. తనతో పాటు ఏడు వేల మంది సీరమ్ ఉద్యోగులు ఇప్పటికే కొవిషీల్డ్ టీకా మూడో డోసు తీసుకున్నట్లు వెల్లడించారు.