కర్ణాటకలోని బెళగావి జిల్లాలో మావిన హోండ గ్రామానికి చెందిన మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన పొలంలో బావి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అవాక్కయారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా పంచాయతీ అధికారుల నిర్వాకం బయటపడింది. అతడి పొలంలో బావి తవ్వినట్లు రికార్డు సృష్టించి ప్రభుత్వ నిధులనుపంచాయతీ అధికారులు కాజేశారు. బావి తవ్వించుకున్నందుకు తీసుకున్న రుణం చెల్లించాలంటూ ఇటీవల మల్లన్నకు నోటీసు రావడంతో అసలు విషయం బయటపడింది.
బావి పోయింది - వెతికి పెట్టండి !
July 07, 2021
0