తమిళనాడులోని తిరునెల్వేలి మున్సిపల్ ఏరియాలోని పాళయంకోటై ప్రాంతంలోని కేటీసీనగర్లో రైల్వే ఉద్యోగిగా పనిచేసిన రిటైర్ అయిన కోయిల్పిచ్చై, ఉషా దంపతులు నివసించేవారు. మనస్పర్ధలతో వీరిద్దరూ విడిపోయారు. వీరికి 21 ఏళ్ల నీనా, 19 ఏళ్ల రీనా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కోయిల్పిచ్చై మున్నీర్పల్లంలో ఉంటున్నాడు. నీనా, రీనాలు ఇద్దరు తల్లితో పాటు ఉంటున్నారు. వీరు ఇంజినీరింగ్ పూర్తి చేశారు. గత కొద్ది నెలల నుంచి నీనా, రీనాలకు మతిస్థిమితం కోల్పోడంతో తల్లి ఉషా వారిద్దరిని జాగ్రత్తగా చూసుకుంటోంది. ఈ క్రమంలో గత మంగళవారం మధ్యాహ్నం తల్లి ఉషతో కూతుళ్లు ఇద్దరూ గొడవపడ్డారు. ఇదంతా ఇరుగు పొరుగువారికి సర్వసాధారణమే కావటంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి ఉషా మరునాడు ఉదయం నుంచి కనిపించకపోవటంతో అనుమానం వచ్చింది. నీనా, రీనాల అరుపులు వినిపించటంతో ఏం జరిగిందా అని ఇరుగు పొరుగు వారు ఉషా ఇంటికి వచ్చి చూశారు. ఇల్లంతా రక్తం పారుతోంది. ఆ రక్తంలో ఉషా నిర్జీవంగా పడి కనిపించింది.
తల్లి రక్తంలో కూతుళ్లులిద్దరూ ఆడుకోవడం చూసిన ఇరుగుపొరుగువారు హడలిపోయారు. ఆ దృశ్యం వారిని తీవ్రంగా కలచివేసింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి అక్కడి దృశ్యాలనుచూసి షాక్య్యారు. అనంతరం ఉష మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. తల్లిని హతమార్చిన మతిస్థిమితం లేని ఇద్దరు కుమార్తెలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.