19 వరకు లాక్ డౌన్ పొడిగింపు

Telugu Lo Computer
0


తమిళనాడులో జూలై 19 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అయితే, హోటళ్లు, టీ షాపులు, బేకరీలు, రోడ్డు పక్కన నిర్వహించుకునే చిరుతిండ్ల షాపులు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకునేలా సడలింపులు ఇస్తున్నట్లు పేర్కొంది.  ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం వంటి కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా  పాటించాలని పేర్కోంది. పుదుచ్చేరితో రవాణా కార్యకలాపాలు పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇక, పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, మద్యం దుకాణాలు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జూలు తదుపరి ఆదేశాల వరకు మూసే ఉంటాయని స్టాలిన్‌ సర్కారు స్పష్టం చేసింది. వివాహా కార్యక్రమాలకు గరిష్టంగా 50 మందితోనూ, అంత్యక్రియల కార్యక్రమాలకు 20మందికి అనుమతి ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)