జశ్వంత్ అంత్యక్రియలు పూర్తి

Telugu Lo Computer
0

 

జమ్మూకశ్మీర్‌ వద్ద ముష్కరుల కాల్పుల్లో బలైన  వీర జవాన్ జశ్వంత్ రెడ్డి మృతదేహానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనికులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. జశ్వంత్ రెడ్డి మృతదేహానికి తండ్రి శ్రీనివాసరెడ్డి చితి ముట్టించారు. జశ్వంత్‌రెడ్డి మరో నెలరోజుల్లో సెలవులపై ఇంటికి వస్తాడనే ఆశతో తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మలు ఎదురుచూస్తుండగా మరణ వార్త అందింది. దీంతో జశ్వంత్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)