కరోనా కాలంలో పనులు లేక ఆదాయాలు పడిపోయి నానా ఇబ్బందులు పడుతున్న సగటు జీవికి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఊపిరి పీల్చుకోలేని విధంగా చేసింది. అయితే భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులు పడిన వినియోగదారులకు కొంత ఊరట లభించింది. వంట నూనెల దిగుమతులపై సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరడంతో డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 8 నుంచి 20 శాతం వరకు ధరల తగ్గింపు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు దిగుమతి తగ్గింపు నోటిఫికేషన్ను జారీ చేసింది. ధీనివలన మార్కెట్లో నూనెల ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి.
Post a Comment
0Comments
3/related/default