ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు ఆట వర్షార్పణం అయింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు ప్రారంభం కావాల్సిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న సౌతాంప్టన్ లో వర్షం కురుస్తుండడంతో మొదట తొలి సెషన్ రదైయింది.
ఓ దశలో లంచ్ తర్వాత మ్యాచ్ ప్రారంభం అవుతుందని అంచనా వేసినా, వర్షం ఆగకుండా కురవడంతో ఈ రోజు ఆటను రద్దు చేశారు. తొలి రోజు ఆట రద్దయినప్పటికీ ఈ టెస్టు మ్యాచ్ 5 రోజుల పాటు సాగనుంది. ఎందుకంటే, ఇది కీలక సమరం కావడంతో ఈ మ్యాచ్ కు రిజర్వ్ డేను కేటాయించారు.