మాస్క్ ధరిస్తే జరిమానా !

Telugu Lo Computer
0


కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు నిబంధన విధించాయి. మాస్క్‌ ధరించపోతే జరిమానాలు విధిస్తున్నాయి.  అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్‌ వేగవంతం కావడంతో ఇకపై మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశాధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్‌హెడ్‌ కేఫ్‌ రెస్టారెంట్‌ ఒక నిబంధన అమలు చేస్తోంది. మాస్క్‌ ధరించి రెస్టారెంట్లోకి  వచ్చే వారు బిల్లుపై 5 డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)