వ్యాట్ తగ్గించం !

Telugu Lo Computer
0

 


పెట్రోల్‌, డీజిల్‌పై ఇప్పుడే వ్యాట్‌ తగ్గించేది లేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికన్నా అధ్వాన్నంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసిందన్నారు. పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచారని, వాటిని తగ్గించాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే చేసిన డిమాండ్‌కు మంత్రి రియాక్ట్ అయ్యారు.

డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ ఇనిగో హృదయరాజ్ అసెంబ్లీలో మాట్లాడుతూ మాజీ సీఎం కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని, రాష్ట్రానికి తిరుచిని రెండవ రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)