ఢిల్లీ మెట్రోలో బ్లూలైన్లోని ఒక బోగీలో ఓ కోతి తన చేష్టలతో ప్రయాణికులను వినోదపరచింది. తరువాత ఒక ప్రయాణికుని ప్రక్కన కూర్చుని రైలు అద్దాలలోంచి ఎంచక్కా రాజధాని అందాలను వీక్షించింది. కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో వీడియోతీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది.