కోవిడ్ టీకా వేయడంలో ఆంధ్ర ప్రదేశ్ రికార్డ్ సృష్టించింది. ఈ ఒక్క రోజే 11 లక్షల 85 వేల మందికి టీకాలు ఇచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. గతంలో ఒకే రోజులో 6 లక్షల 28 వేల వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 96 లక్షల మందికి మొదటి డోస్ వేసినట్లు అనిల్ సింఘాల్ తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పిల్లలపై మూడో వేవ్ ప్రభావ ఎక్కువగా ఉంటుందన్న ఊహాగానాలను ఎయిమ్స్ డాక్టర్లు కొట్టిపారేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.