ఉత్తరప్రదేశ్ లోని అలీగడ్ లో లోక్ సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న పండిత్ కేశవ్ దేవ్ కు ఎలక్షన్ కమిషన్ రెండు జతల చెప్పుల గుర్తును కేటాయించింది. దీంతో కేశవ్ చెప్పుల దండను మెడలో ధరించి ప్రచారం హోరెత్తిస్తున్నారు. తెల్లని తలపాగా, మెడలో చెప్పుల దండతో ఆయన అలీగఢ్ లోని వీధులన్నీ చుట్టేస్తు్న్నారు. సమర్థిత్ భ్రష్టాచర వ్యతిరేక సే అనే పేరుతో అవినీతి అంతం చేయడమే టార్గెట్గా తాను ఎన్నికల బరిలో దిగినట్లు కేశవ్ దేవ్ తెలిపారు. తనకు మద్దతుగా నిలవాలని ఫుడ్ స్టాళ్లు, షాప్లు, ప్రజల వద్దకు వెళ్లి కోరుతున్నాడు. ఇక, ఈ స్థానంలో 2019లో బీజేపీ నుంచి సతీష్ కుమార్ గౌతమ్ ఏకంగా 6,56,215 ఓట్లు సాధించి గెలిచారు.
అలీగడ్ లో ఎంపీ అభ్యర్థి చెప్పుల దండతో వినూత్న ప్రచారం!
April 09, 2024
0
Tags