జైపూర్‌ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహం !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని జైపూర్‌ వ్యాక్స్‌ మ్యూజియంలో భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ  మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్‌ అనూప్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాదిగా పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు, యువత నుంచి మ్యూజియంలో కోహ్లీ విగ్రహం ఏర్పాటుచేయాలని పెద్దఎత్తున డిమాండ్లు వచ్చినట్లు తెలిపారు. ఆయన విగ్రహాన్ని ఈ మ్యూజియంలో పెట్టాలని వాళ్లంతా బలమైన అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. అందువల్ల ప్రపంచ వారసత్వ దినోత్సవం రోజు (ఏప్రిల్‌ 18న) కోహ్లీ విగ్రహాన్ని మ్యూజియంలో పెట్టినట్లు వెల్లడించారు. 35 కిలోల బరువు కలిగిన ఈ విగ్రహాన్ని తయారుచేసేందుకు రెండు నెలల సమయం పట్టింది.


Post a Comment

0Comments

Post a Comment (0)