పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు : కిరణ్‌కుమార్‌రెడ్డి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు తెదేపా అభ్యర్థిగా నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఏర్పాటు చేసిన సభలో కిరణ్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ పాలన నుంచి ఇసుక మాఫియా వరకు అన్నీ చేశారని ధ్వజమెత్తారు. ''నేను సీఎంగా ఉన్నప్పుడు పీసీసీ పదవి కోసం ఒకరోజు రాత్రి నా కాళ్లు పట్టుకున్నారు. ఉదయం మళ్లీ వచ్చి అదే విషయంపై నా కాళ్లావేళ్లా పడ్డారు. పీసీసీ పదవికి సహకరించలేదని కసి పెంచుకున్నారు. రైతుల రక్తం తాగిన పెద్దిరెడ్డి ఎన్నికల్లో డబ్బు పంపిణీకి సిద్ధంగా ఉన్నారు. సీఎంగా నేను చేసిన అభివృద్ధి తప్ప పీలేరులో ఆయన చేసిందేమీ లేదు. అక్రమాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు'' అని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)