కేంద్ర మంత్రి కారు డోర్‌ తగిలి బస్సు కింద పడి బీజేపీ కార్యకర్త మృతి !

Telugu Lo Computer
0


బెంగళూరులో కేంద్ర మంత్రి కారు డోర్‌ను ఢీకొట్టిన బీజేపీ కార్యకర్త బస్సు కింద పడి మరణించాడు. దీంతో కేంద్ర మంత్రి కారు డ్రైవర్‌, బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే బెంగళూరు నార్త్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం కేఆర్ పురం ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కాగా, కేంద్ర మంత్రి శోభా కారు రోడ్డు పక్కగా నిలిచి ఉండగా డ్రైవర్‌ చూసుకోకుండా డోర్‌ తెరిచాడు. స్కూటర్‌పై వెళ్తున్న బీజేపీ కార్యకర్త అయిన 63 ఏళ్ల ప్రకాష్‌, ఆ కారు డోర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడ్డాడు. అటుగా వెళ్తున్న బస్సు కింద ఆయన పడటంతో అక్కడికక్కడే మరణించాడు. మరోవైపు ఈ సంఘటన జరిగినప్పుడు కేంద్ర మంత్రి శోభా ఆ కారులో లేరని పోలీసులు తెలిపారు. ఆమె అక్కడ ప్రచారం కోసం కారు దిగి ర్యాలీగా వెళ్లారని చెప్పారు. ప్రకాష్‌ మృతికి కారణమైన కేంద్ర మంత్రి కారు డ్రైవర్‌, బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)