అగ్గిపెట్టె ఇవ్వనందుకు యువకుడి దారుణహత్య !

Telugu Lo Computer
0


న్యూ ఢిల్లీ లోని తిమార్‌పూర్ ప్రాంతంలో అగ్గిపెట్టె ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరు టీనేజర్లు, ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని వినియోగించారు. సిగరేట్ కాల్చేందుకు అగ్గిపెట్టే ఇవ్వడానికి నిరాకరించడం హత్యకు దారి తీసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. చనిపోయిన వ్యక్తిని 21 ఏళ్ల అన్షుల్ భాటీగా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులిద్దర్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తిమార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్లకు సంబంధించిన పీసీఆర్ కాల్ వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోరిక్షా లోపల, దాని చుట్టూ రక్తపు మడుగు ఉన్నట్లు గుర్తించినట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(నార్త్) ఎంకే మీనా తెలిపారు. గాయపడిన వ్యక్తిని హిందూరావు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే బాధిత యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సంఘటన స్థలంలో సాక్షి వాంగ్మూలాన్న పోలీసులు నమోదు చేశారు. క్రైమ్ స్పాట్‌లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి పోలీసులు ఇద్దరు నిందితులను ఆదివారం పట్టుకున్నారు. నేరం చేయడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ప్రశ్నించగా.. సిగరేట్ కాల్చడానికి అగ్గిపెట్టె ఇవ్వాలని కోరగా.. బాధితుడు అందుకు నిరాకరించాడని, ఇది వాగ్వాదానికి దారి తీసిందని వెల్లడించారు. కోపంతో ఒక వ్యక్తి బాధితుడిపై కత్తితో దాడి చేశారని, ఘటన తర్వాత ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిని బాల నేరస్తుల్లో ఒకరికి గతంలో దారుణమైన నేరానికి పాల్పడిన చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)