విస్తరణ దిశగా రైళ్ల విడి భాగాల తయారీ సంస్థ పొల్మోర్ స్టీల్ !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మెదక్ జిల్లాలో కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆటోమోటివ్ పార్కులో కొలువుదీరిన పొల్మోర్ స్టీల్ వృద్ధి బాటలో కొనసాగుతోంది. భారతదేశంలో పోలండ్ రాయబారి డాక్టర్ సెబాస్టియన్ డొమ్‌జల్‌స్కీ ఈ ప్లాంటును గురువారం సందర్శించారు. ఆయనతో పాటు పోలండ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ అలెక్సాండర్ దండా, పోలండ్ రాయబార కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాల కౌన్సెలర్ పావెల్ మోక్ర్‌జైకి, పొల్మోర్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు కంపెనీని సందర్శించిన వారిలో ఉన్నారు. పాత ప్లాంట్‌తో పాటు నిర్మాణంలో ఉన్న రెండోప్లాంటునూ సందర్శించింది. తెలంగాణలో ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు పొల్మోర్ స్టీల్ యాజమాన్యాన్ని అభినందించారు. కేంద్ర ప్రభుత్వ మేకిన్ ఇండియా ఇన్షియేటివ్‌కు అనుగుణంగా సాగుతున్న ఈ కంపెనీ తన విజయాలను మరింతగా కొనసాగించాలని ఆకాంక్షించారు. పొల్మోర్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, "భారతదేశంలో పలు యూరోపియన్ కంపెనీలు ఉన్నాయి. అదే బాటలో పొల్మోర్ స్టీల్ మరింతగా విస్తరించనుందని గర్వంగా చెబుతున్నాం. మరో మూడు ఎకరాల భూమి తీసుకుని 2.5 మిలియన్ యూరోల పెట్టుబడి కూడా సంపాదించి, అదనంగా మరో వంద మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. పోలండ్‌లోని మాతృ సంస్థలో కూడా 30 మంది పొల్మోర్ స్టీల్ ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్లి పని చేస్తున్నారు. దీనివల్ల మన వాళ్లు యూరప్ వెళ్లి అక్కడ నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు యూరోపియన్ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారుచేయడానికి వీలవుతోంది" అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐఐసీలతో పాటు, వివిధ వర్గాల నుంచి అందుతున్న అపార మద్దతు పట్ల సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్లాంటుకు వచ్చి తమను ప్రోత్సహించినందుకు రాయబారి డొమ్‌జల్‌స్కీ, కాన్సుల్ జనరల్ డాక్టర్ అలెక్సాండర్ దండాకు, ఆర్థిక కౌన్సెలర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)