విడాకులు తీసుకున్న సుజిత్ వాసుదేవ్ - మంజు జంట !

Telugu Lo Computer
0


సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ తన భార్యతో విడిపోయినట్లు ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజిత్ 2020లోనే మంజు నుంచి విడిపోయానని, ఇటీవలే విడాకులు సంబంధించిన ప్రక్రియ అంతా ముగిసిందని, విడి విడిగానే జీవిస్తున్నామని చెప్పారు. అయితే మంజు ఇప్పటికీ తనకు ఎంతో మంచి స్నేహితురాలని, ఆమెను మంచి స్నేహితురాలిగానే పిలవానుకుంటున్నానన్నారు. విడిపోయిన తర్వాత మంజు కెరీర్ విజయవంతంగానే సాగుతోందని, ఈ విషయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. తెలుగులో సుజిత్ నాలుగు సినిమాలకు పనిచేశారు. 2000లో మళయాళ నటి మంజు పిళ్లైని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్తుతం ఎంతో హాట్ టాపిక్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)