మొదటిసారి ఓటు వేసే వారికి ఎయిరిండియా ఆఫర్ !

Telugu Lo Computer
0


యిరిండియా 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు దేశీయ, అంతర్జాతీయ సర్వీసులలో విమాన టికెట్లపై 19 శాతం రాయితీని అందిస్తోంది. మొబైల్ యాప్, కంపెనీ వెబ్ సైట్ నుంచి విమాన టికెట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ఓటర్లు సంబంధిత నియోజకవర్గానికి సమీపంలోని విమానాశ్రయానికి ప్రయాణించడం కోసం విమాన టికెట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లైట్, ఎక్స్ ప్రెస్ వాల్యూ, ఎక్స్ ప్రెస్ ఫ్లైక్స్, ఎక్స్ ప్రెస్ బిజ్ విభాగాలకు వర్తిస్తుందని ఎయిరిండియా సంస్థ స్పష్టం చేసింది. అలాగే ఆఫర్ పొందడం కోసం ఐడీతో పాటు ఇతర సంబంధిత ధృవపత్రాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 29న తన 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మన దేశ భవిష్యత్తును పెంపొందించడంలో యువతదే కీలక పాత్ర అని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డాక్టర్ అంకుర్ గార్గ్ పేర్కొన్నారు. వారిని ప్రోత్సహించి మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకునేలా సులభతరం చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)