నాకూ, అభిషేక్‌ బెనర్జీకీ ముప్పు పొంచి ఉంది: మమతా బెనర్జీ

Telugu Lo Computer
0


నని, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని భాజపా టార్గెట్ చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాము సురక్షితంగా లేమని, తమకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. టీఎంసీ పార్టీ అభ్యర్థి, మంత్రి బిప్లబ్ మిత్రాకు మద్దతుగా కుమార్‌గంజ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ''సోమవారం పెద్ద విధ్వంసం జరుగుతుంది. అది టీఎంసీ, దాని నాయకులను వణికిస్తుంది.'' అని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి శనివారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై మమత స్పందిస్తూ ''భాజపా నన్ను, అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. మేము సురక్షితంగా లేము. అయినా కాషాయ పార్టీ కుట్రలకు మేము భయపడం. పార్టీ నాయకులు, బెంగాల్ ప్రజలపై జరుగుతున్న కుట్రను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా" అని మమత పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)