ఎన్నికల ప్రచార సభలో స్పృహతప్పి పడిపోయిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని యావత్మాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ సృహతప్పి పడిపోయారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. యావత్మాల్‌ పరిధిలోని పూసాద్‌ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా.. గడ్కరీ ఒక్కసారిగా స్పహ కోల్పోయారు. అనంతరం ఆయన కిందపడిపోబోయారు. దీంతో అక్కడే వేదికపై ఉన్న సెక్యురిటీ సిబ్బంది, బీజేపీ నాయకులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)