చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి !

Telugu Lo Computer
0


చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, నాకు ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని,  డబుల్ సెంచరీ కొట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని , ఈ ఎన్నికలు ప్రతీ ఒక్కరి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని, పెత్తందారుల ముఠా పై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి అని, ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా..? సీఎం జగన్ లాంటి నీతిమంతుడు కావాలా..? ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. గ్రామ స్వరాజ్యంతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపామన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తుకు వస్తుందా..? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని తెలిపారు. చంద్రబాబు లా నేను మోసపు హామీలు ఇవ్వనని  సీఎం జగన్ అన్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)