జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలోన ఉన్న జీలం నదిలో పడవ బోల్తా పడి ఆరుగురు దుర్మరణం చెందారు. పలువురు మిస్సయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 10 నుంచి 12 మంది పాఠశాల విద్యార్థులతో కలిసి బోటు బయలుదేరింది. మార్గ మధ్యలోకి వెళ్లేసరికి వాటర్ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో బోటు తిరగబడిపోయింది. ఆరుగురు మరణించినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మిగతా వారి జాడ కనిపించలేదు. ఎస్డీఆర్ఎఫ్ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. కొద్దిరోజులుగా జమ్మూకాశ్మీర్లో హిమపాతానికి తోడు భారీవర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ స్థానిక ప్రజలను అలర్ట్ చేసింది. ఇళ్లలో నుంచి ఎవరు బయటకురావద్దని హెచ్చరించింది. అయితే వర్షం తగ్గడంతో విద్యార్థులు పాఠశాలకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
జీలం నదిలో పడవ బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు దుర్మరణం !
April 16, 2024
0
Tags