తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు !

Telugu Lo Computer
0


తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. హైదరా బాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో ఉష్ణోగ్రతలు నమో దయ్యా యి. నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా.. 40.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌ లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)