బాలికపై యువకుడు అత్యాచారం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై యువకుడు పలుమార్లు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్బం దాల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కుటుంబ సభ్యులతో మీర్ పేటలో నివసిస్తోంది. అదే ఊరికి చెందిన శేఖర్ అనే వ్యక్తి గతేడాది నుంచి బాలికపై రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో గర్భనిరోధక మాత్రలు బాలికతో బలవంతంగా వేయించాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు గుర్తించి వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. వారి ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)